నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆస్తి కోసం పదేళ్ల తమ్ముడిని హత్య చేసిన అన్న

By Pratap
|
Google Oneindia TeluguNews

Nizamabad District
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఓ అన్న సొంత తమ్ముడ్ని హత్య చేసిన సంఘటన జిల్లాలోని బిచ్కుంద మండలం రాజుళ్ల గ్రామంలో జరిగింది. గంగారాం (20) అనే యువకుడు తన పదేళ్ల తమ్ముడు మోహన్‌ను హత్య చేశాడు. మోహన్ పదో తరగతి చదువుతున్నాడు. వీరి తల్లిదండ్రులు ఎనిమిదేళ్ల క్రితం మరణించారు. దాంతో ఇద్దరు కూడా తాత దగ్గరే పెరిగారు. గంగారాంకు పెళ్లయింది. అన్నదమ్ములిద్దరికి కలిపి ఒకటిన్నర ఎకరం భూమి, రెండు ఇళ్ల స్థలాలు ఉన్నాయి. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో మొత్తం కాజేయడానికి తమ్ముడి హత్యకు పథకం వేశాడు.

శనివారం సాయంత్రం మోహన్‌ను గంగారాం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో గల నిర్జన ప్రదేశంలోకి తీసుకుని వెళ్లి గొంతు నులిమి చంపేశాడు. మోహన్ కోసం ఎంత వెతికినా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానంతో పోలీసులు గంగారాంను విచారించారు. మోహన్‌ను తానే హత్య చేశానని అతను అంగీకరించాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
A greedy person has killed his 10 year old younger brother for property in Nizamabad district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X