విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రముఖ రచయిత పురాణపండ రంగనాథ్ కన్నుమూత

By Pratap
|
Google Oneindia TeluguNews

Puranapanda Ranganath
విజయవాడ: ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్టు పురాణపండ రంగనాథ్ శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా వాస్క్యులర్ డిమెన్షియాతో బాధపడిన రంగనాథ్ హైదరాబాద్ లో తన చిన్న కుమారుడి నివాసంలో మృతి చెందా రు. రంగనాథ్ 1942లో తూర్పుగోదావరి జిల్లా అలమూరులో జన్మించారు. ఆయన ప్రముఖ రచయిత ఉషశ్రీకి సోదరుడు. ఆంధ్రప్రభ దినపత్రిక, ఆంధ్రజ్యోతి వారపత్రికల్లో పనిచేశారు.

మండుతున్న కాశ్మీరం, స్వర్ణాలయం వంటివి ఆయన రచనల్లో సుప్రసిద్దమైనవి. చిన్న పిల్లలను ఆకట్టుకునే విధంగా సైన్స్ పుస్తకాలు కూడా రాశారు. అమెరికా ప్రభుత్వ పిలుపు మేరకు 1985లో అక్కడికి వెళ్లి, వాతావరణ కాలుష్యంపై ప్రసంగించారు. అలా అమెరికాకు వెళ్లిన తొలి పాత్రికేయుడు ఆయనే. కాలుష్యం నుంచి భూగోళాన్ని కాపాడుకుందాం అనే పుస్తకాన్ని రాశారు.

English summary
Writer and journalist Puranapanda Ranganath passed away at his residence in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X