హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మార్ కేసు, గుండె నొప్పితో ఆస్పత్రిలో బిపి ఆచార్య

By Pratap
|
Google Oneindia TeluguNews

BP Acharya
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో అరెస్టయిన ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చేరారు. గుండె నొప్పితో ఆయన నిమ్స్‌లో చేరినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం సరిగా లేదని, గ్లూకోస్ ఎక్కించాల్సి ఉంటుందని మంగళవారం ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను మంగళవారం సాయంత్రం నిమ్స్‌లో చేర్పించాల్సి వచ్చింది. సిబిఐ ఆచార్యను తమ కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మార్ అక్రమాల కేసులో ఐఏఎస్ అధికారి బిపి ఆచార్యను సిబిఐ అధికారులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు. ఎమ్మార్ కేసులో బిపి ఆచార్య ఎ-1 నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. సోమవారం తమ ఎదుట హాజరు కావాల్సిందిగా సిబిఐ ఆయనకు శనివారం నోటీసులు పంపించింది. దీంతో ఆయన సోమవారం వచ్చి సిబిఐ ఎదుట హాజరయ్యారు.

ఆయనపై పలు సెక్షన్ల క్రింద సిబిఐ కేసు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, అకౌంట్లు తారుమారు చేశారనే పలు అభియోగాలు మోపింది. ఎమ్మార్ ఒప్పందంలో ఏపిఐఐసి వాటా తగ్గినా ప్రేక్షక పాత్ర వహించారని ఎఫ్ఐఆర్‌లో సిబిఐ ఆరోపించింది. ప్రభుత్వ వాటా తగ్గడంలో ఆయనదే కీలక పాత్ర అని, మిత్రులకు, సహచరులకు విల్లాలు కేటాయించడంలో సూత్రదారి అని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. కాగా ఇటీవల సునీల్ రెడ్డి తదితరులను సిబిఐ సైలెంట్‌గానే అరెస్టు చేసింది. ఆచార్య గతంలో ఎపిఐఐసి ఎండిగా పని చేశారు. కాగా ఎమ్మార్ కేసులో బిపి ఆచార్యది నాలుగో అరెస్టు. తనను సిబిఐ అరెస్టు చేసిందని ఆచార్య అధికారులకు సమాచారం అందించారు. బిపి ఆచార్యను రెండు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి ఎల్లుండి నాలుగు గంటల వరకు ఆచార్యను కోర్టు సిబిఐ కస్టడీకి అప్పగించింది. విల్లాల విక్రయాల్లో బిపి ఆచార్య కీలక సూత్రధారి అని సిబిఐ చెప్పింది.

English summary
IAS officer BP Acharya arrested in EMAAR properties case, was admitted in NIMS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X