చిరుపై ఆరోపణలు చేస్తే అంతే: దేవినేని ఉమపై ఎమ్మెల్యేలు

Chiranjeevi
విజయవాడ: తమ నేత చిరంజీవిపై తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు చేసిన ఆరోపణలను ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. చిరంజీవికి విజయవాడలోని భవానీ ద్వీపాన్ని ప్రభుత్వం బహుమతిగా కట్టబెడుతోందనే దేవినేని ఉమ ఆరోపణలను వారు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. అజాతశత్రువు, వివాద రహితుడు అయిన చిరంజీవిని విమర్శిస్తే దేవినేని ఉమామహేశ్వర రావుకు మైనసే అవుతుందని వారన్నారు. అయినా చిరంజీవిని విమర్శించే స్థాయి దేవినేని ఉమకు లేదని వారన్నారు.

దేవినేని ఉమమహేశ్వర రావు ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపణల్లో నిజం ఉందని తేలితే తాము రాజీనామా చేస్తామని, నిజం లేదని తేలితే ఉమా మహేశ్వర రావు రాజీనామా చేస్తారా అని వారు సవాల్ చేశారు. భవానీ ద్వీపం ఒప్పందాన్ని రద్దు చేస్తే తనకు వస్తుందని దేవినేని ఉమ అనుకుంటున్నారని వారన్నారు. దేవినేని ఓ బ్లాక్ మెయిలర్ అని, దేవినేని ఉమ బ్లాక్ మెయిల్ వల్లనే కృష్ణా జిల్లాకు పరిశ్రమలు రావడం లేదని వారు విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాల విధ్వంసంలో చిరంజీవి పాత్ర ఉందనే ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ ఆరోపణలను వారు ఖండించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+