వైయస్ విజయమ్మ లేఖపై ప్రధాని ఏం చేస్తారో?: టిడిపి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి, ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మలు ఆ పార్టీకి అద్దె మనుషులుగా వ్యవహరిస్తున్నారని టిడిపి మహిళా నేత అనురాధ విజయవాడలో అన్నారు. రాష్ట్రంలో అవినీతి మాఫియా రాజ్యమేలుతోందని టిడిపి సీనియర్ నేత ఎర్రన్నాయుడు వేరుగా విజయవాడలో ధ్వజమెత్తారు. సమాచార హక్కు కమిషన్ కాంగ్రెసు పునరావాస కేంద్రంగా మారిందని దుయ్యబట్టారు. నియామకాల్లో నిబంధనలను తుంగలో తొక్కారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవి కాపాడుకునేందుకే ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 2జి కుంభకోణం కేసులో పిఎంవో పాత్ర ఉందని, దానికి బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications