వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలులో కళ్లు తిరిగి పడిపోయిన బిపి ఆచార్య

By Pratap
|
Google Oneindia TeluguNews

BP Acharya
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో అరెస్టయిన ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య గురువారంనాడు హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో అస్వస్థతకు గురయ్యారు. కళ్లు తిరిగి ఆయన కింద పడిపోయారు. దీంతో జైలులో వైద్యుల చేత చికిత్స అందించారు. అయితే, ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆచార్యకు గుండెపోటు వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆచార్యకు సిబిఐ కోర్టు ఈ నెల 15వ తేదీ వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను కోర్టులో హాజరు పరిచిన తర్వాత చంచల్‌గుడా జైలుకు తరలించారు.

జైలుకు వచ్చిన తర్వాత ఆచార్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అరెస్టు చేసిన తర్వాత బిపి ఆచార్యను కోర్టు రెండు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగించింది. ఆ సమయంలో సిబిఐ అధికారులు ఆయనకు బేగంపేటలోని ఆస్పత్రిలో చికిత్స అందించి దిల్‌కుషా అతిథిగృహానికి తరలించారు. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆయనకు గుండె నొప్పి వచ్చింది. దీంతో ఆయనను సిబిఐ అధికారులు నిమ్స్‌కు తరలించారు. నిమ్స్‌లో చికిత్స, వైద్య పరీక్షల అనంతరం గురువారం ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. బిపి ఆచార్య ఆరోగ్యం బాగాలేదని, వైద్యులు పరీక్షిస్తున్నారని జైలు ఉన్నతాధికారి కేశవ నాయుడు చెప్పారు.

English summary
IAS officer BP Acharya arrested in EMAAR case, is suffering from fever.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X