చిరు కలవడంవల్లే బయటకు వచ్చాం!: రాజశేఖర్ జీవిత

రాష్ట్రంలో డెబ్బై లక్షల ఓట్లున్న పార్టీని కలుపుకోవడం సహజమేనని వారు అన్నారు. ఆ విషయాన్ని తాము తప్పు పట్టడం లేదన్నారు. అయితే కాంగ్రెసుకు అంతగా ప్రచారం చేసిన తమను పిలిచి విలీనం తదితర విషయాలు రాజకీయాల్లో సహజమేనని చెబితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కాగా వారు కాంగ్రెసుకు దూరమై ఆ తర్వాత కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయనతో విభేదించి ఆ పార్టీ నుండి కూడా బయటకు వచ్చారు.












Click it and Unblock the Notifications