వైయస్ రాజశేఖర రెడ్డికి గుంటూరులో మరో ఆలయం

అలాంటి వైయస్ విగ్రహం తమ గ్రామంలో ఉంటే తమకు సుఖసంతోషాలు ఉంటాయనే విశ్వాసంతో వారు ఆలయాన్ని నిర్మించుకున్నారు. కుంకలగుంట గ్రామంలో వైయస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీనిని నిర్మించారు. రూ.18 లక్షల రూపాయలతో దీనిని నిర్మించారు. ఇందులో ఆరడుగుల వైయస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం ఓదార్పు యాత్రలో భాగంగా ఆ గ్రామానికి వచ్చినప్పుడు దీనిని ఆవిష్కరించారు. గ్రామంలో పలు వైయస్సార్ విగ్రహాలు ఆవిష్కరించారు. కాగా బుధవారం గుంటూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications