నాటి సదస్సులోనే దీక్ష చేస్తానని చెప్పా: వైయస్ జగన్

ధర్మవరం పట్టుచీరలు ఒక్క మన రాష్ట్రంలోనే కాదని దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చందిన చీరలన్నారు. ఇంతటి ప్రసిద్ధి కెక్కిన ధర్మవరంలో గత కొద్దికాలంగా చేనేత కార్మికుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కు పోతోందన్నారు. గత ఒక్క సంవత్సరంలోనే ధర్మవరం పట్టణంలో 17 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేతన్నలను ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. కాగా ఈ దీక్షలు గుర్నాథ్ రెడ్డి, విజయ చందర్, భూమా నాగి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications