తెలంగాణ, మద్యంపై దద్దరిల్లిన సభ, రేపటికి వాయిదా

అసెంబ్లీ మొదటి రోజే గవర్నర్ ప్రసంగంపై చర్చ జరిగే రోజు ఇలా చేయకూడదని ఆయన విపక్షాలకు సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. విపక్షాలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ అసెంబ్లీని అరగంట పాటు వాయిదా వేశారు. రెండోసారి సమావేశమైనప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో స్పీకర్ సభను మరో పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. ఆ తర్వాత మూడోసారి సభ సమావేశమైంది. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి గవర్నర్ ప్రసంగంపై చర్చను ప్రారంభించారు. అయితే విపక్షాలు మరోసారి తెలంగాణ, మద్యం మాఫియాపై పోడియం చుట్టుముట్టాయి. దీంతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications