చిరంజీవి సిఎం పక్క ఖాళీలో కూర్చోవచ్చు: చంద్రబాబు
శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించుదామని అంటే ఆకలవుతుందంటూ సభను వాయిదా వేశారన్నారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ తమ పట్ల అగౌరవంగా వ్యవహరిస్తుంటే బిఏసి సమావేశానికి ఎందుకు వెళ్లాలన్నారు. కాంగ్రెసు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రేమ కురిపిస్తోందన్నారు. సిండికేట్లలో తన వర్గానికి చెందిన మంత్రిని సిఎం కాపాడుకున్నారని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఆరోపించారని ఆ వ్యక్తి ఎవరో చెప్పాలన్నారు. గెలిచే సత్తా ఉంటే మీడియా ప్రతినిధులకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయిస్తామన్నారు. కాంగ్రెసును ముప్పయ్యేళ్లు ఎదుర్కొన్న టిడిపికి టిఆర్ఎస్ ఓ లెక్క కాదన్నారు. ఎమ్మార్ వ్యవహారంలో ప్రక్షాళన జరగాలని, అవినీతిపరుల ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా టిడిపి నేతలు ఎసిబి డిజిని కలిశారు. మద్యం మాఫియాపై దాడులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎసిబి రిపోర్టును బహిర్గతం చేయాలని కోరారు.