హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో చెబుతా: కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులపై వేటుకు తాము తీసుకున్న సమయం ఎంతో అసెంబ్లీలో చెబుతానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం అన్నారు. అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. జగన్ ఎమ్మెల్యేల వేటు స్పీకర్ పరిధిలోని అంశమన్నారు. దానిపై ఆయన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. స్పీకర్‌ను పార్టీ గానీ, ప్రభుత్వం గానీ మరెవరైనా ప్రభావితం చేయలేరన్నారు. ఉప ఎన్నికలకు తాము సమాయత్తమవుతున్నామని చెప్పారు. మద్యం సిండికేట్లపై ఎసిబి ప్రాథమిక విచారణ జరుపుతోందన్నారు. ఎసిబి నివేదికను తాను అసెంబ్లీలో ప్రకటిస్తానని చెప్పారు. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి తనకు ఆరోగ్యం బాగా లేదని లేఖ రాశారన్నారు. సూటుకేసులాంటి సందర్భం లేని వ్యాఖ్యలపై తాను స్పందించనన్నారు. కడప జిల్లా నేతలు, కార్యకర్తల స్పందన బాగుందన్నారు.

జూడాల సమ్మె విషయం మంత్రివర్గ ఉపసంఘం చూసుకుంటుందని చెప్పారు. సమ్మె వల్ల ఇప్పటి వరకు ఎవరూ మృతి చెందలేదని అలా జరిగితే బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. పేదలకు వైద్యం అందించకుండా చూడటం సరికాదన్నారు. జూడాల సమ్మె కారణంగా 880 మంది డాక్టర్లను ఆసుపత్రులకు డిప్యూటీ చేసినట్లు చెప్పారు. ప్రతిపక్షాలు సభను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేసులపై ఐఏఎస్ అధికారులు భయపడాల్సిన పని లేదన్నారు. ఐఏఎస్ అధికారులు తమ అభిప్రాయం చెప్పారని, విచారణ చేసినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదని, కోర్టు నిర్ణయిస్తుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు.

ప్రజారాజ్యం పార్టీ విలీనం పద్ధతి ప్రకారం జరుగుతుందన్నారు. ఇరు పార్టీలు తీర్మానం చేసిన అనంతరం విలీన ప్రక్రియ పూర్తవుతుందన్నారు. సమాచార కమిషనర్ల నియామకం పారదర్శకంగా జరిగిందని ఆయన చెప్పారు. పోలవరం టెండర్ల ఫైలు ఇంకా తన వద్దకు రాలేదన్నారు. తాము ఎన్నికలకు భయపడటం లేదన్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుపుతామని, 2011 జనాభా లెక్కల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. సభలో ఏ అంశం చర్చకు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మీడియాలో కథనాలు వచ్చినంత మాత్రాన పార్టీలో ఏదో జరుగుతుందనుకోవడం సరికాదన్నారు.

English summary
CM Kiran Kumar Reddy responded on YSR Congress Party chief YS Jaganmohan Reddy camp mlas, liquor syndicate, polavaram and JUDAs issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X