పోలీసుల తీరుపై కలెక్టర్కు వైయస్ విజయమ్మ ఫిర్యాదు

తమ పార్టీ నేతలపై ఉద్దేశ్య పూర్వకంగా కేసులు బనాయిస్తున్నారని అన్నారు. పులివెందుల ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఘటనకు సంబంధం లేకున్నప్పటికీ తమ పార్టీ నేతలపై కేసు పెట్టారని కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఉద్దేశ్య పూర్వకంగా బనాయిస్తున్న ఈ కేసులను ఉపసంహరించే విధంగా చర్యలు తీసుకోవాలని విజయమ్మ కలెక్టర్ను కోరారు. పార్టీ మహిళా కార్యకర్తల పైనా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆమె చెప్పారు. ఉప ఎన్నికల నేపథ్యంలో వారందరినీ అరెస్టు చేయించే కుట్రకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. నమోదైన కేసులు పరిశీలించి తమ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని ఆమె కలెక్టర్ను కోరారు.












Click it and Unblock the Notifications