వరకట్న చెల్లింపునకు దోపిడీకి దిగిన ఎంబిఎ అమ్మాయి

తల్లి రమాదేవి, కూతురు శారద ఎపిఐఐసి కాలనీలోని కల్పన అనే గృహిణి ఇంట్లోకి చొరబడ్డారు. ముసుగులు కప్పుకున్న వారిద్దరు కల్పనను కింద పడేసి ఆమె గొలుసును ఎత్తుకుపోవడానికి ప్రయత్నించారు. కల్పన పెద్దగా అరవడంతో ఇరుగు పొరుగువారు వచ్చి ఆ ఇద్దరు మహిళలను పట్టుకున్నారు.
శారద కుషాయిగుడాలోని సాయి సుధీర్ కళాశాలలో ఎంబిఎ రెండో సంవత్సరం చదువుతోంది. పెళ్లి కుమారుడి కుటుంబానికి శారద కుటుంబ సభ్యులు లక్ష రూపాయల వరకట్నం ఇవ్వాల్సి ఉంది. మార్చి 8వ తేదీన పెళ్లి పెట్టుకున్నారు. కల్పన ఒంటరిగా ఉంటుందని తెలుసుకుని తల్లీకూతుళ్లు ఈ దోపిడీ యత్నానికి దిగారు. నిందితులు ఇంతకు ముందు కల్పన ఇంటి పక్కనే ఉండేవారు. ఇప్పుడు కమలాపురిలో ఉంటున్నారు.












Click it and Unblock the Notifications