ఢిల్లీ నుండే లీడ్ చేస్తున్న బొత్స, సమావేశాలపై దృష్టి
న్యూఢిల్లీ: ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తరఫున ఏ ఫారాలు తీసుకునేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ రాక కోసం

ఉప ఎన్నికల్లో అభ్యర్థులను సర్వే ద్వారా ముఖ్యమంత్రి ఎంపిక చేసినందువల్ల ఆయన ఇష్టాయిష్టాలకే తాను ప్రాధాన్యతనిచ్చినట్లు దామోదర్తో చెప్పినట్లు సమాచారం. ఒక్క మహబూబ్నగర్ విషయంలోనే ఒకే జిల్లాలో ముగ్గురు రెడ్లకు సీట్లు ఇవ్వడం, షబ్బీర్ అలీ స్థానంలో కూడా ఆయన సూచించిన రెడ్డి వర్గానికి చెందిన అభ్యర్థికి ఇవ్వడంతో విజయ లక్ష్మికి చివరి నిమిషంలో సీటు ఇవ్వలేకపోయామని ఆయన వివరించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి గట్టిగా పట్టుపడితే మహబూబ్నగర్కు విజయ లక్ష్మిని ఎంపిక చేసి ఉండేవారమని, కాని ఆయన కూడా అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడ్డారని బొత్స చెప్పినట్లు తెలిసింది. గురువారం ఆజాద్ను కలిసి ఆయన హైదరాబాద్కు తిరిగి రానున్నారు.












Click it and Unblock the Notifications