హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాసలోకి నాగం వస్తారు, బిజెపిపై నో కామెంట్: కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ నగారా సమితి చైర్మన్, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి త్వరలో తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకుంటారని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. నాగం జనార్ధన్ రెడ్డితో పాటు హరీశ్వర్ రెడ్డి కూడా పార్టీలో చేరనున్నారని తెలిపారు. నాగం నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. టిఆర్ఎస్ అభ్యర్థుల మాదిరిగానే నాగం గెలుపు కోసం కూడా పార్టీ నేతలు గట్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన తెలంగాణ భవనంలో సాయంత్రం పోలిట్ బ్యూరో, శాసనసభా పక్షం, రాష్ట్ర కార్యవర్గ ఉద్యమ కమిటీ సంయుక్త సమావేశంలో మాట్లాడారు.

అసెంబ్లీ సమావేశాల కంటే మనకు ఉప ఎన్నికలే ముఖ్యమని, అయినా అసెంబ్లీకి పోయి చేసేది ఏముందని, ఎలాగూ సభ నుంచి సస్పెండ్ చేస్తారు కదా అని అన్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలంతా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారంలో పాల్గొనాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నికలు జరుగుతున్న అసెంబ్లీ స్థానాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను ఈ సందర్భంగా పార్టీ నేతలకు కెసిఆర్ వివరించారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో టిడిపి అభ్యర్థికి డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉందని, అక్కడా ఆ అభ్యర్థికి డిపాజిట్ రాకుండా చేయాలని అన్నట్లుగా సమాచారం. అన్ని స్థానాల్లోనూ భారీ మెజారిటీతో గెలుపొందటానికి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడేలా చూడాలన్నారు. మహబూబ్‌నగర్‌పై రగడ నేపథ్యంలో బిజెపిపై పార్టీ నేతలెవరూ పెదవి విప్పొద్దని ఆయన ఆదేశించారు.

English summary
TRS chief K Chandrasekhar Rao said on thursday that Nagam Janardhan Reddy will join in TRS soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X