హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపిలో విలీనం చేస్తారా: కెసిఆర్‌కు రేవంత్ ఆఫర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని తమ పార్టీలో విలీనం చేస్తారా అని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి కె. చంద్రశేఖర రావును ప్రశ్నించారు. తెరాసను తమ పార్టీలో విలీనం చేస్తే కెసిఆర్‌కు పోలిట్‌బ్యూరో సభ్యత్వం ఇస్తామని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసులో విలీనం చేసత్రాని అందరూ అనుకుంటున్నారని, దీనిపై కెసిఆర్ వివరణ ఇవ్వాలని ఆయన అన్నారు.

తెలంగాణకు అనుకూలంగా తాము చంద్రబాబుతో కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇప్పిస్తామని, తమ పార్టీలో తెరాసను విలీనం చేయాలని ఆయన అన్నారు. అఖిల పక్ష సమావేశంలో తమ పార్టీ నేతలు ఏం చెప్పారో కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. తాము చిదంబరంతో భేటీలోనూ తెలంగాణనే కోరామన్నారు. అధికార కాంగ్రెసు పార్టీకి ఇబ్బందులు వచ్చినప్పుడల్లా టిఆర్ఎస్ వారిని అదుకుంటోందని అన్నారు. తమను ఆదుకున్నప్పుడల్లా కాంగ్రెసు వారికి ఏదో ఒక ప్యాకేజీ కట్టబెడుతోందని అన్నారు. అలజడి సృష్టించి ప్యాకేజీ పొందుతారని టిఆర్ఎస్ పై విరుచుకు పడ్డారు. మద్యం సిండికేట్ల వ్యవహారంపై చర్చ జరిగేటప్పుడు టిఆర్ఎస్ అలజడి సృష్టించడం ఖాయమన్నారు.

English summary
TDP MLA Revanth Reddy extended bumper offer to TRS President K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X