కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

25 ఏళ్లుగా రాజ్యసభ పదవి లేదు: వైయస్ వివేకానంద

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy
కడప: కడప జిల్లాకు ఇరవై ఐదు ఏళ్లుగా రాజ్యసభ పదవి రావడం లేదని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి గురువారం కడప జిల్లాలో అన్నారు. తాను రాజ్యసభ సీటును కోరేందుకే న్యూఢిల్లీ వెళ్లానని చెప్పరు. కార్యకర్తల కోసమే తాను రాజ్యసభ పదవిని ఆశిస్తున్నానని స్పష్టం చేశారు.

కాగా వైయస్ వివేకానంద రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన రాజ్యసభ సీటు తనకు ఇవ్వమని అడిగేందుకు ఢిల్లీ వెళ్లారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, మిగిలిన పార్టీ నేతలను కలిసి ఆయన తనకు పదవి ఇవ్వాలని కోరారు. మూడు రోజుల క్రితం ఢిల్లీలో విలేకరులతో వివేకానంద మాట్లాడారు. తాను రాజ్యసభ సీటు అడిగేందుకే ఢిల్లీ వచ్చానని చెప్పారు. తమ పార్టీకి జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు, టిడిపి రెండూ శతృవులేనన్నారు. తనకు పదవి వచ్చినా రాకున్నా జగన్ పార్టీలో చేరేది లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు అమలు పరచడం లేదని జగన్ చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవమన్నారు.

English summary
YS Vivekananda Reddy said that there is no Rajyasabha post to Kadapa from 25 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X