ఇరాక్లో కాల్పులు, పేలుళ్లు: 32 మంది మృతి

బగ్దాద్కు ఉత్తరంలో ఉన్న షియాల ప్రార్థనలకు సంబంధించిన జిల్లా కధిమియా జిల్లాలో కారు బాంబు పేలింది. ఈ సంఘటనలో ఆరుగురు మరణించారు. దాదాపు 15 మంది గాయపడ్డారు. అధమియాలో సాయుధులు పోలీసు చెక్పోస్టుపై దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు.
కర్రాడ జిల్లాలోని పోలీసు చెక్ పాయింట్ వద్ద కారు బాంబు పేలింది. ఇందులో ఓ వ్యక్తి మరణించాడు. 11 మంది గాయపడ్డారు. అదే ప్రాంతంలో మరో బాంబు పేలింది. మొదటి పేలుడు తర్వాత అర గంటకు జరిగిన ఈ పేలుడులో మరో వ్యక్తి మరణించాడు. ఆరుగురు గాయప్డడారు. దురాలో రోడ్డు పక్కన బాంబు పేలి ఇద్దరు మరణించారు, పది మంది గాయపడ్డారు. అబు షిర్ రెస్టారెంట్ వద్ద రెండు బాంబులు పెలి ఇద్దరు మరణించారు. పది గాయపడ్డారు. మన్సూరులో కారు బాంబు పేలి ఇద్దరు మరణించారు, ఐదుగురు గాయపడ్డారు. దియాల్ ప్రొవిన్స్లో రెండు కారు బాంబులు పేలి ముగ్గురు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఇంకా పలు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనల్లో మరణాలు సంభవించాయి, చాలా మంది గాయపడ్డారు.












Click it and Unblock the Notifications