హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లల్ని చంపిన తండ్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Charminar
హైదరాబాద్: భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఇద్దరు పిల్లల గొంతు కోసి హతమార్చిన సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. హైదరాబాదులోని ఎర్రగడ్డలోని సుల్తాన్ నగర్‌లో రూబిన్ కుటుంబం ఉంటోంది. రూబిన్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. భార్యపై అనుమానంతో రూబిన్ తన ఇద్దరు పిల్లలు పన్నెండేళ్ల తేజ, పదకొండేళ్ల రేచల్‌ను శుక్రవారం అర్ధరాత్రి గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత అతను పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోయాడు. అనుమానం వల్లనే తాను ఈ హత్యలు చేసినట్లు పోలీసులకు నిందితుడు చెప్పాడు. తేజ ఏడో తరగతి చదువుతుండగా, రేచల్ ఐదో తరగతి చదువుతోంది.

పెళ్లైన తర్వాత భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. దీంతో గతంలో భార్య పుట్టింటికి వెళ్లింది. ఇటీవల భార్యను తీసుకు వచ్చాడు. భార్య ఓ జ్యూవెల్లరీ దుకాణంలో పని చేస్తోంది. అయితే ఆమె తిరిగి వచ్చాక కూడా గొడవలు తగ్గలేదు. అనుమానంతో రూబిన్ భార్యతో ఘర్షణకు దిగేవాడు. కాగా ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
Father killed two of his children on friday midnight at Erragadda of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X