జగన్కు ఝలక్, మాకినేని పెద రత్తయ్య రాజీనామా
జిల్లాలో ఇద్దరు ముగ్గురు నేతలతోనే ఇబ్బంది ఉందని ఆయన అన్నారు. ఇక వైయస్సార్ కాంగ్రెసులో కొనసాగనన్నారు. తాను కార్యకర్తల ఒత్తిడితో రాజీనామా చేయలేదని చెప్పారు. కాగా మాకినేని పెద రత్తయ్య తెలుగుదేశం పార్టీ నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజుల నుండి ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. గుంటూరులో పార్టీ చీఫ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి మొదటి విడద ఓదార్పు యాత్ర నిర్వహించిన సమయంలోనూ ఆయన అలక బూనారు. ఆ తర్వాత నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత పలుమార్లు ఆయన పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారని తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరతారనే వాదనలు వినిపించాయి.
Comments
English summary
Guntur district senior political leader Makineni Peda Rathaiah is said that he is ready to leave YSR Congress Party.
Story first published: Saturday, February 25, 2012, 12:38 [IST]