వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినీ హీరోయిన్ ప్రత్యూష మృతి కేసు: సిద్దార్థకు బెయిల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Prathyusha
న్యూఢిల్లీ: తెలుగు సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు సిద్దార్థ రెడ్డికి సుప్రీం కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. సిద్దార్థ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ సుప్రీం కోర్టు మంజూరు చేసింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై సిద్దార్థ రెడ్డి ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టు విధించిన శిక్షను తగ్గిస్తూ తనకు బెయిల్ మంజూరు చేయాలని సిద్దార్థ రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఇటీవల ఆయన శిక్షను కూడా తగ్గించిన విషయం తెలిసిందే.

తెలుగు సినీ నటి ప్రత్యూష కేసులో సిద్ధార్థ రెడ్డి పిటిషన్‌పై సుప్రీం కోర్టుకు ఇటీవల సిబిఐకి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రత్యూష మృతి కేసులో తనకు హైకోర్టు విధించిన శిక్షను తగ్గించాలని కోరుతూ సిద్ధార్థ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సిద్ధార్థ రెడ్డి పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు సిబిఐని ఆదేశించింది. గతంలో హైకోర్టు సిద్ధార్థ రెడ్డికి విధించిన ఆరేళ్ల శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ తీర్పు చెప్పింది. దీంతో సిద్ధార్థ రెడ్డి ఆ తర్వాత కోర్టులో లొంగిపోయాడు.

English summary
Siddartha Reddy, who is accused in Prathyusha case was get bail today from Supreme Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X