నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ రెండు పార్టీలతో వైయస్ జగన్ పార్టీ కుమ్మక్కు: ఆనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anam Ramanarayana Reddy
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితితో, సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యారని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆరోపించారు. కొవ్వూరులో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పొలంరెడ్డి శ్రీనివాస రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆనం సోదరులు, మంత్రి పితాని సత్యనారాయణ సోదరులు హాజరయ్యారు. మంత్రి ఆనం మాట్లాడుతూ.. కొవ్వూరులో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసులు కుమ్మక్కై బావమరుదులను బరిలోకి దింపాయని ఆరోపించారు.

కొవ్వూరులో తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. ఉప ఎన్నికలు జరిగే ఏడు స్థానాల్లోనూ కాంగ్రెసు పార్టీయే ఘన విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. ఈ ఉప ఎన్నికలు కాంగ్రెసు ప్రభుత్వంపై ప్రజాధరణ అంచనాకు ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. కాగా ఏడు నియోజకవర్గాల్లో మార్చి 18వ తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

English summary
Minister Anam Ramanarayana Reddy blamed YSR Congress Party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X