జగన్ ఆస్తుల కేసు వేగవంతం: విదేశీ కంపెనీల విచారణ

కాగా జగన్ ఆస్తుల కేసులో నిందితుడు, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ మరోమారు సిబిఐ ఎదుట మంగళవారం హాజరయ్యారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆయన దిల్ కుషాలోని దర్యాఫ్తు కార్యాలయానికి వచ్చారు. కేసులో నిమ్మగడ్డ 12వ నిందితుడు. ఆయనను సిబిఐ ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించింది. జగన్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ అందుకు ప్రతిఫలంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వాన్ పిక్ సీ పోర్టు ప్రాజెక్టు కోసం పదిహేనువేల ఎకరాలను పొందారు. దీనికి సంబంధించి సిబిఐ ఆయనను మరోమారు పిలిచింది. రెండు రోజుల క్రితమే వాన్ పిక్కు భూకేటాయింపులు జరిపిన ఐఏఎస్ అధికారి అప్పటి భూపరిపాలన శాఖ కమిషనర్ను కూడా ప్రశ్నించింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్ట్రర్ల నుంచి అధికారులు వివరాలు సేకరించారు.












Click it and Unblock the Notifications