జగన్ ఎమ్మెల్యేల సీట్లకు జూన్ లోగా ఎన్నికలు

రాష్ట్రపతి ఎన్నికల లోపలే వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుల స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తామని ఆ వర్గాలు చెప్పాయి. అయితే స్పీకర్ వారిపై అనర్హత వేటు వేస్తేనే ఇది సాధ్యమవుతుంది. కాగా, వారంలోగా రాజ్యసభ ఎన్నికలు నిర్వహణకు చర్యలు ప్రారంభిస్తామని ఆ వర్గాలు చెప్పాయి. వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై చర్యలు తీసుకోదలుచుకుంటే స్పీకర్ రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ముందే అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత అది సాధ్యం కాదని అంటున్నారు.
ఇదిలా ఉంటే, నెల్లూరు జిల్లా కోవూరు స్థానంలో కాంగ్రెసు పార్టీపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. కాంగ్రెసు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపించింది.












Click it and Unblock the Notifications