సార్వత్రిక సమ్మె పాక్షికం: నారాయణ, రాఘవులు అరెస్ట్
బ్యాంకింగ్, ఇన్సురెన్స్ తదితర రంగాల పైన బంద్ ప్రభావం అంతగా ఏమీ పడలేదు. బంద్ ప్రభావం కేరళలో కనిపించింది. అక్కడ బస్సులు రోడ్డెక్కలేదు. దుకాణాలు తెరవలేదు. యుపిఏ విధానాలు నిరసిస్తూ బ్యాంకులు, కార్యాలయాలు అన్నింటిని మూసివేశారు. కాగా కేరళలో అధికారంలో ఉన్న యుడిఎఫ్ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల్లో నో వర్క్ నో పే ఆర్డర్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్ రాష్ట్రాల్లో అధికారులు సమ్మెలో పాల్గొనకుండా ఒప్పించారు.
కాగా ఆంధ్ర ప్రదేశ్లోను బంద్ ప్రభావం పాక్షికంగానే కనిపించింది. జిల్లాలలోని ప్రధాన నగరాల్లో కార్మిక సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. హైదరాబాదులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సిపిఎం రాఘవులు తదితరులు అరెస్టయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమ్మెతోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలని హెచ్చరించాయి. సార్వత్రిక సమ్మెకు సిఐటియు, ఏఐటియుసి, హెచ్ఎంఎస్, ఐఎన్టియుసి, బిఎంఎస్ మద్దతు పలికాయి.