ప్రభుత్వ భూమిపై కన్నేసిన సినీ నిర్మాత దిల్ రాజు
ఆ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం - ఇటీవలి జిల్లా సమీక్షా సమావేశంలో స్థానిక శాసనసభ్యుడు యెండాల లక్ష్మినారాయణ ఆ విషయాన్ని లేవనెత్తారు. ప్రభుత్వం నుంచి తమకు దరఖాస్తు అందిన మాట నిజమేనని, దాన్ని పరిశీలిస్తున్నామని కలెక్టర్ డి. వరప్రసాద్ చెప్పారు. దిల్ రాజుకు భూమి కేటాయించాలని నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెసు నాయకుడొకరు ఒత్తిడి పెడుతున్నట్లు తెలుస్తోంది.
శాసనసభ మాజీ స్పీకర్ కె. సురేష్ రెడ్డి కూడా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద గల 6 ఎకరాల భూమి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు రెవెన్యూ వర్గాలు చెప్పాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సురేష్ రెడ్డి ఆ స్థలంలో టూరిజం రిసార్టును అభివృద్ధి చేయాలని సురేష్ రెడ్డి అనుకుంటున్నారు. నిజామాబాద్ కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో గల ఆ స్థలం విలువ ఎకరానికి పది లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. దిల్ రాజు, సురేష్ రెడ్డి నుంచి తమకు ఏ విధమైన దరఖాస్తులు రాలేదని జిల్లా రెవెన్యూ అధికారి పి. జగదీశ్వరాచారి చెప్పినట్లు ఆ పత్రిక రాసింది.