చమురు ధరల పెంపు: ఇండియాపై ఒబామా నిందలు

Barack Obama
వాషింగ్టన్: దీర్షకాలంలో చమురు ధరలు పెరగడానికి భారత్, చైనా, బ్రెజిల్‌లే కారణమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిందించారు. ఈ దేశాల్లో ఇంధన అవసరాలు పెరుగుతున్నాయని, దీని వల్ల ప్రపంచంలో చమురు ధరలు పెరుగుతాయని ఆయన అన్నారు. ఈ దేశాల్లో జనాభా ఎక్కువగా ఉందని, దాంతో ఇంధన అవసరాలు పెరిగి చమురు ధరలు పెరుగుతాయని ఆయన అన్నారు. నార్త్ కరోలినాలోని డైమ్లెర్ ట్రక్ తయారీ ప్లాంట్ కార్యక్రమంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.

చైనాలో 2010లోనే దాదాపు పది మిలియన్ల కార్లు రోడ్డు మీదికి వచ్చాయని, పది మిలియన్లంటే ఆషామాషీ కాదని, చైనా, ఇండియా, బ్రెజిల్‌ల్లోని ప్రజలు కార్లు కోరుకుంటున్నారని, వారి జీవనప్రమాణాలు పెరుగుతున్నాయని, దాని వల్ల చమురు డిమాండ్ పెరుగుతుందని, ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల పెంపునకు దారి తీస్తుందని ఆయన అన్నారు.

ఈ పరిణామాలను బట్టి చూస్తే పాత పద్ధతుల్లో వ్యాపారం చెల్లుబాటు కాద అర్థమవుతోందని, ఇంధన కోసం కొత్త వనరులను అన్వేషించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. సహజ వాయువు వంటివాటిపై దృష్టి పెడుతున్నామని ఆయన అన్నారు. దీనివల్ల ఈ దశాబ్దాంతానికి 6 లక్షల ఉద్యోగాలు కూడా ఏర్పడుతాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+