మ.నగర్లో టిఆర్ఎస్ ఓడినా నష్టం లేదు: కిషన్ రెడ్డి

మహబూబ్నగర్లో బిజెపికి టిఆర్ఎస్ మద్దతు ఇవ్వనప్పటికీ, తెలంగాణ కోసం రాజీనామా చేసి టిఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న నలుగురికీ తాము మద్దతు ఇస్తున్నామన్నారు. మహబూబ్నగర్లో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ స్థానంలో పోటీ చేస్తున్న జాతీయ పార్టీ బిజెపిని గెలిపించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని ప్రజలను కోరారు. మ.నగర్ లో విద్యార్థులు, ఉద్యోగులు, ఐకాస నేతలు అందరూ బిజెపికే మద్దతు ఇస్తున్నారన్నారు. తమ పార్టీ అగ్రనేతలు రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీ బుధవారం నుంచి పోటీ చేస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications