హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీడియా ప్రతినిధులపై జాలి చూపిన జయసుధ

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayasudha
హైదరాబాద్: శాసనసభ జరుగుతున్నంత సేపు లాబీల్లో కూర్చునే సదుపాయం లేకుండా గంటల తరబడి నిల్చొని ఎలా ఉండగలుగుతున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జయసుధ మీడియా ప్రతినిధులపై సానుభూతి చూపించారు. మంగళవారం సభ వాయిదా పడిన తర్వాత లాబీల నుంచి వెళ్తున్న జయసుధ అక్కడ విధుల్లో ఉన్న కొంత మంది మార్షల్స్ అభ్యర్థన మేరకు వారితో కలిసి ఫొటోలు దిగారు.

ఈ సందర్భంగా అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు.."మార్షల్స్, అసెంబ్లీ సిబ్బంది కోరగానే.. చాలా ఓపిగ్గా ఫొటోలు దిగుతున్నారు'' అని ఆమెతో అన్నారు. "తనతో ఫొటో దిగటం వల్ల వారికి ఆనందం కలిగితే అంతకంటే కావాల్సింది ఏముంది ?'' అని జయసుధ అంటూనే.. లాబీల్లో గంటల తరబడి ఎలా నిలబడుతున్నారంటూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. "ఏదైనా ముఖ్యమైన అంశం ఉన్నప్పుడైతే ఫరవాలేదు. కాని, రోజూ లాబీల్లో గంటల తరబడి నిలబడటం ఇబ్బందే. కనీసం మీరు కూర్చోవటానికి సీట్లు కూడా ఏర్పాటు చేయలేదు'' అంటూ ముందుకెళ్లిపోయారు.

English summary
MLA Jayasudha expressed her solidarity towards media persons in Assembly premises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X