యడ్డీకి రూ.200 కోట్లు ఇచ్చాం: శ్రీరాములు సంచలనం
గాలిని అక్రమంగా కేసులో ఇరికించినా అప్ప స్పందించలేదన్నారు. అందుకే బిజెపితో తాను తెగతెంపులు చేసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. బిజెపి అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం గాలి సోదరులకు ద్రోహం చేశాయని మండిపడ్డారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకుంటాయన్నారు. అయితే శ్రీరాములు పేల్చిన బాంబుతో బిజెపి ఉలిక్కిపడింది. పార్టీ తరఫున మంత్రులు రామదాస్, విశ్వేశ్వర హెగ్డే కాగేరి ఇక్కడ ఓ ప్రకటన చేశారు. ముడుపులకు ఆధారాలు చూపించాల్సిన బాధ్యత శ్రీరాములు పైనే ఉందన్నారు. ఇంత డబ్బు గాలి బ్రదర్స్కు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని నిలదీశారు. శ్రీరాములు ఆరోపణలను తోసిపుచ్చలేమని బిజెపి మాజీ అధ్యక్షుడు బీబీ శివప్ప అన్నారు. ఢిల్లీలో ఉన్న యడ్డి ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు. బెంగళూరుకు వచ్చాకే బదులిస్తానని చెప్పారు. కాగా గదగ్లోని శ్రీ తొంటధార్య మఠాధిపతికి శ్రీరాములు ఈ విషయాన్ని చెప్పినప్పుడు తీసిన వీడియో క్లిప్పింగులను కన్నడ టివి వార్తా ఛానళ్లు మంగళవారం సాయంత్రం ప్రసారం చేశాయి.