సోనియాతో భేటీ, కాంగ్రెసు రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
రషీద్ అల్వీ స్థానంలో జాఫర్ షరీఫ్ను గానీ షకీల్ అహ్మద్ను గానీ రాజ్యసభకు నామినేట్ చేయవచ్చునని తెలుస్తోంది. చిరంజీవికి రాజ్యసభ బెర్త్ ఖాయమైనట్లు తెలుస్తోంది. ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలనేది కాంగ్రెసు అధిష్టానం ఆలోచన. దీంతో దాసరి నారాయణ రావును తిరిగి నామినేట్ చేయడానికి పార్టీ అధిష్టానం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. కేశవరావు తెలంగాణలో అతిగా వ్యవహరించారని అధిష్టానం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
కాగా, రేణుకా చౌదరి, వెంకట్రామిరెడ్డి, వైయస్ వివేకానంద రెడ్డి తదితరులు రాజ్యసభ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగించారు. రేణుకా చౌదరిని కూడా రాజ్యసభకు ఎంపిక చేయవచ్చుననే వార్తలు వస్తున్నాయి. మరో సీటు తెలంగాణకు ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. అలా ఇచ్చే సమక్షంలో సురేష్ రెడ్డి పేరు ముందుకు వస్తుందని చెబుతున్నారు.