వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆదాయం పన్ను పరిమితి రూ.2 లక్షలకు పెంపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: వ్యక్తిగత వార్షిక ఆదాయం పన్ను పరిమితిని రూ. 2 లక్షలకు పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం పార్లమెంటులో సాధారణ బడ్టెట్‌ను ప్రతిపాదించారు. రూ.2 లక్షల నండి రూ.5 లక్షల వరకు ఆదాయంపై పది శాతం పన్ను, రూ.5 లక్షల నుండి రూ.పది లక్షల వరకు ఆదాయంపై 20 శాతం పన్ను, పది లక్షలకు పైబడి ఆదాయంపై 30 శాతం పన్ను విధించనున్నట్లు ఆయన తెలిపారు. ఎస్‌బి ఖాతాలో రూ.10వేల ఖాతాపై పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఎస్‌బి ఖాతాలపై పది నవేలమదుపుపై పన్ను మినహాయింపును ఆయన ప్రకటించారు. వృద్ధులకు, మహిళలకు గరిష్ట ఆదాయం పన్ను పరిమితిని రూ. 2 లక్షలుగా నిర్ధారించారు. పరిశ్రమలకు పన్ను మినహాయింపు కోసం టర్నోవర్ పరిమితి కోటి రూపాయలకు పెంచారు. కార్పొరేట్ పన్ను యధాతథంగా ఉంచారు. రూ. 2 లక్షల బంగారం కొనుగోళ్లపై తక్షణ టిడిఎస్ ఉంటుందని చెప్పారు. సినీ రంగానికి సేవా పన్ను మినహాయించారు. సర్వీస్ టాక్స్, సెంట్రల్ ఎక్స్జైజ్‌కు కామన్ కోడ్ అమలు చేస్తామని చెప్పారు. సేవా పన్ను పరిధి నుంచి విద్య, ప్రభుత్వ సేవలు, వినోదం వంటి 17 సేవలను మినహాయించారు.

వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు ఆయన ప్రత్యేక నిధులు కేటాయించారు. కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వంద కోట్ల రూపాయలు సమకూర్చనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే హైదరాబాదులోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వంద కోట్ల రూపాయల నిధిని సమకూరుస్తున్నట్లు ఆయన తెలిపారు.

English summary
Pranab Mukherjee has raised the personal annual income limit to Rs 2 lakhs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X