వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబూ! పార్టీని మూసేసి ఇంట్లో కూర్చుంటావా!: కెటిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

KT Rama rao
హైదరాబాద్: పోలవరం టెండర్లలలో తాము తప్పు చేసినట్లు రుజువైతే ఉరేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తప్పు చేయనట్లు రుజువైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీని మూసేసుకుని ఇంట్లో కూర్చోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు అన్నారు. అందుకు చంద్రబాబు సిద్ధమేనా అని ఆయన అడిగారు. చంద్రబాబుపై ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆస్తులపై తాము ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబు తన ఆస్తులపై విచారణకు సిద్ధపడాలని ఆయన అన్నారు. ఇరువురి ఆస్తులపై బహిరంగ చర్చకు చంద్రబాబు సిద్ధపడుతారా అని ఆయన అడిగారు. చంద్రబాబు బతుకంతా నోట్లు, వెన్నుపోట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.

2009 ఎన్నికల సమయంలో తమతో పొత్తు కోసం చంద్రబాబే ఉత్సాహపడ్డారని ఆయన అన్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పని చంద్రబాబు కెసిఆర్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఎంతగా గీపెట్టినా, చంద్రబాబు పెంపుడు జంతువులు ఎంతగా అరిచినా తెలుగుదేశం పార్టీకి ప్రజలు చెంపపెట్టు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. స్టేలు తెచ్చుకోకపోతే చంద్రబాబు చర్లపల్లి జైలులో చిప్పకూడా తింటూ ఉండేవారని ఆయన వ్యాఖ్యానించారు.

చంద్రబాబును ఆయన చచ్చిన పాముగా అభివర్ణించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు పాతర వేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధపడి ఉన్నారని ఆయన అన్నారు. లోకసభను తెలంగాణపై కెసిఆర్ వారం రోజులు స్తంభింపజేశారని, అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడేలా చేసింది కెసిఆరేనని ఆయన అన్నారు. పార్టీని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కాంట్రాక్టర్లకు దారాదత్తం చేశారని ఆయన ఆరోపించారు. పార్టీలో నాయకులే లేనట్లు సుజనా చౌదరికి, నామా నాగేశ్వర రావుకు చంద్రబాబు సీట్లిచ్చారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సంఘీభావం తెలపడానికి చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెనకడుగు వేశారని ఆయన అన్నారు. అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గన్నట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
TRS MLA KT Rama rao challenged TDP president N Chandrababu Naidu tp proove allegations on Polavaram tenders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X