తెలంగాణ, అవినీతి: సభలో దుమారం, నిలదీసిన బాబు

అనంతరం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఆరుగురు మంత్రులకు సుప్రీం కోర్టు నోటీసుల అంశంపై చర్చించాలని తాము వారం రోజులుగా కోరుతున్నా ప్రభుత్వం ముందుకు రావడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. వివాదాస్పదమైన 26 జివోలను స్పీకర్ ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. అవినీతి అంశం చాలా సీరియస్ విషయమని ప్రభుత్వం దీనిని తేలిగ్గా తీసుకుంటోందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసి అన్నారు. అవినీతి అంశంపై తాము తొలిసారి విపక్షానికి మద్దతిస్తున్నామని చెప్పారు. అవినీతిపై అధికార, విపక్షాలకు చిత్తశుద్ధి లేదని విమర్సించారు. అవినీతిపై చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలతో సభలో దుమారం రేగింది. దీంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications