పాలమూరు ఫలితాన్ని ఊహించలేదు: లగడపాటి

బిజెపి బలపడడం కాంగ్రెసు పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందికరమేనని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన 15 - 16 శాతం ఓట్లు మహబూబ్నగర్లో బిజెపికి పడ్డాయని, తెరాసకు పది శాతం హిందువుల ఓట్లు కూడా పడలేదని, తెరాస మైనారిటీని నిలబెట్టడం వల్ల బిజెపికి లాభం జరిగిందని ఆయన అన్నారు. మహబూబ్నగర్లో బిజెపి గెలవడం దురదృష్టకర పరిణామమని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురి చేసినా 24 - 25 శాతం ఓట్లు సాధించిందని ఆయన అన్నారు. మహబూబ్నగర్లో తెరాస గెలుస్తుందని లగడపాటి చేయించిన సర్వే వెల్లడించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications