'జగన్‌'ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు: రఘువీరా

Raghuveera Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి రఘువీరా రెడ్డి గురువారం విరుచుకు పడ్డారు. అవినీతిపై జగన్ చేసిన వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెసు పార్టీ ఉన్నంత కాలం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మా పార్టీ నాయకుడేనని ఆయన స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గెలుపొందారని, కానీ ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం ఓడిపోయారని అన్నారు. జగన్ గెలుపు ఎమోషనల్ గెలుపు అని అది ఎంతో కాలం నిలవదని అన్నారు. ఒకటి, రెండు స్థానాల్లో గెలిచినంత మాత్రాన సంబరం కాదని అన్నారు. రాష్ట్రంలోని ఏడు నియోజకవర్గాలలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి ఓ హెచ్చరిక అని ఆయన చెప్పారు.

కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు జిల్లాలో మాట్లాడుతూ.. తాను అధికారంలోకి వస్తే అవినీతిరహిత రాష్ట్రంగా చేస్తానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాను ముఖ్యమంత్రిని అయితే రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందిస్తానని, కొవూరు ప్రజలు అవినీతికి పట్టం కట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని, బాబు హయాంలో రాష్ట్రంలో అవినీతి హెచ్చుమీరిందని అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 42 లోకసభ స్థానాలకు 35 గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+