ఏప్రిల్ రెండోవారంలో చిరంజీవికి మంత్రి పదవి
2009 ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి వర్గ విస్తరణ చేశారు. అప్పుడు రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు. అదే ఫార్ములాను ఇప్పుడు కూడా అనుసరించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ఇద్దరికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి వర్గంలో ఎస్ జైపాల్ రెడ్డి ఒక్కరే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నారు. అయితే, రాష్ట్రానికి చెందిన మిగతావారంతా సహాయ మంత్రులు కాగా, జైపాల్ రెడ్డి ఒక్కరిదే క్యాబినెట్ హోదా. అయినా సరే, తెలంగాణకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు ఉన్నట్లు చెబుతున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడిన పార్లమెంటు సభ్యుడు హరీష్ రావత్కు కూడా కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని అంటున్నారు.