భలే జోక్: జగన్ వ్యాఖ్యలపై రేణుకా చౌదరి సెటైర్లు

35 పార్లమెంటు స్థానాలు గెలుస్తానన్న జగన్ వ్యాఖ్యలపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ హైదరాబాదులో స్పందించారు. అసలు దీనిపై మాట్లాడడానికి నాకే నవ్వోస్తుందన్నారు. ముప్పై అయిదు పార్లమెంటు సీట్లు వస్తాయని జగన్ అనటం పెద్ద జోక్ అన్నారు. 275 పార్లమెంట్ స్థానాలను కూడా వాళ్ల పార్టీయే గెలుస్తుందని చెప్పలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఆ పార్టీ పోటీ చేయలేదు, ఆంధ్రా, రాయలసీమల్లో ఉన్నవి 25 ఎంపీ స్థానాలేనని గుర్తు చేశారు. 35 స్థానాలు ఎలా కైవసం చేసుకుంటారని అన్నారు. 50 వేల మెజారిటీ వస్తుందని వైయస్సార్ కాంగ్రెసు జబ్బలు చరుచుకుంటే కేవలం 23 వేల మెజారిటీయే వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications