హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: సిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణ సమస్య పరిష్కారానికి ఆత్మహత్యలు పరిష్కారం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం అన్నారు. ఆయన ఉదయం విశాఖపట్నం బయలుదేరే ముందు హైదరాబాదులో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం సరైన సమయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదన్నారు. యువత ఆవేశానికి, ఉద్వేగానికి లోనై తమ బంగారు భవిష్యత్తును కోల్పోవద్దని సూచించారు. బోజ్యా నాయక్ మృతి పట్ల సిఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బోజ్యా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నేతల ఇళ్లపై ఆందోళనకారుల దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రజల మనోభావాలు కేంద్రానికి తెలుసునని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా బోజ్యా నాయక్ మృతి పట్ల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. యువకులు భావోద్వేగాలకు లోను కావొద్దని చంద్రబాబు సూచించారు. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

కాగా శనివారం వరంగల్ జిల్లాలో బోజ్యా నాయక్ అనే యువకుడు తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాను కాలుతున్న సమయంలోనూ బోజ్యా జై తెలంగాణ అంటూ నినాదాలు చేయడం గమనార్హం. బోజ్యా అంతిమ యాత్రను ఆదివారం వరంగల్ జిల్లా ఎంజిఎం ఆసుపత్రి వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నుండి ప్రారంభించారు. అంతిమయాత్ర సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

English summary
CM Kiran Kumar Reddy suggested Telangana students and youth about Telangana issue. He said that suicides are not solution to Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X