హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇప్పటికైన కళ్లు తెరవండి: సీమాంధ్రకు టి-కాంగ్ ఎంపీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

T Rajaiah
హైదరాబాద్: సీమాంధ్ర నేతలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఆదివారం సీమాంధ్ర నేతలకు సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన బోజ్యా నాయక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బోజ్యా నాయక్ మృతిపట్ల కాంగ్రెసు ఎంపీలు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థులు, యువత చనిపోయి సాధించేదేమీ లేదని హితవు పలికారు. బతికి పోరాడాలని, చచ్చి సాధించేదేమీ లేదన్నారు. బతికి తెలంగాణ సాధించుకుందామని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ చెప్పినట్లుగా శాంతియుతంగా పోరాడి మన తెలంగాణను మనం సాధించుకుందామని అన్నారు. బోజ్యా నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని ఎంపీలు చెప్పారు.

తెలంగాణకు పిడికెడు సమైక్యవాదులే అసలైన అడ్డంకి అని విమర్శించారు. విద్యార్థులు సంయమనం పాటించాలని కోరారు. తెలంగాణ ఉద్యమం ప్రస్తుతం ప్రజల చేతుల్లో ఉందని అన్నారు. ఈ ఉద్యమం ఏ ఒక్క నాయకుడి చేతిలోనో లేదా పార్టీ చేతిలోనో లేదని అన్నారు. ఈ విషయాన్ని సీమాంధ్ర నేతలు తెలుసుకోవాలన్నారు. తెలంగాణ కోసం తాము వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. అధిష్టానాన్ని ఒప్పించి తెలంగాణ సాధిస్తామన్నారు. ఎంపీలు రాజయ్య, బలరాం నాయక్ సమావేశంలో మాట్లాడారు.

English summary
Telangana Congress MPs suggested Seemandhra leaders about Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X