కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలను తిరగనివ్వం: కోదండరామ్

Kodandaram
వరంగల్: ఇక కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను రోడ్ల పైన తిరగనిచ్చేది లేదని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ ఆదివారం అన్నారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న బోజ్యా నాయక్ అంతిమ సంస్కారాల కోసం కోదండరామ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, శాసనమండలి సభ్యుడు చుక్కా రామయ్య, తెరాస నేతలు హరీష్ రావు, వినోద్ కుమార్ వెళ్లారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడారు. విద్యార్థులు, యువకుల ఆత్మహత్యలపై కాంగ్రెసు, టిడిపి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీలో ఆత్మహత్యలపై అన్ని పార్టీలు ప్రస్తావించాలని అన్నారు. లేదంటే కాంగ్రెసు, టిడిపి ఎమ్మెల్యేలను తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు.

ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి వైఖరి వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయని హరీష్ రావు అన్నారు. బాధ్యులను వెంటనే ప్రభుత్వం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో పదవులు వద్దు తెలంగాణ కావాలన్న గండ్ర ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మెప్పు కోసం తెలంగాణవాదం తగ్గుతోందని అంటున్నారని విమర్శించారు. అసెంబ్లీలో ఆత్మహత్యపై పట్టుబడతామని అన్నారు. టిడిపి, కాంగ్రెసు తెలంగాణపై మోసం చేస్తోందని మండిపడ్డారు. కాగా బోజ్యా నాయక్‌ది ఆత్మహత్య కాదని కాంగ్రెసు హత్య అని తెలుగుదేశం పార్టీ నేత కడియం శ్రీహరి వేరుగా అన్నారు. ఈ పార్లమెంటు సమావేశాలలోనే బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+