మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు,కిరణ్ ప్రయత్నించినా తగ్గించలేకపోయారు: నాగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
మహబూబ్ నగర్: తెలంగాణ ప్రాంతంలో యువకుల బలిదానాల పాపం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలదేనని తెలంగాణ నగారా సమితి వ్యవస్థాపకుడు, నాగర్‌కర్నూల్ శాసనసభ్యుడు నాగం జనార్దన్‌ రెడ్డి శనివారం అన్నారు. అన్నారు. విద్యార్థులు, యువకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బెంగతో ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై కాంగ్రెస్, తెలుగుదేశం రెండు నాల్కల ధోరణిని అవలంభిస్తూ, రాష్ట్ర ఏర్పాటును ఎటూ తేల్చకుండా తాత్సారం చేస్తున్నందువల్లే యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నాగం ఆరోపించారు.

ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డి, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు శతవిధాలా ప్రయత్నించినా ఉప ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని తగ్గించలేక పోయారన్నారు. తెలంగాణ వాదం లేదని చెప్పేందుకు వారు ఉప ఎన్నికల్లో గెలిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారని, కానీ ఓడిపోయారన్నారు. ఉప ఎన్నికల్లో తెలంగాణవాదం అన్నింటినీ అధిగమించిందని చెప్పారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న బోజ్యనాయక్ కుటుంబానికి నాగం జనార్దన్‌ రెడ్డి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు.

English summary
Telangana Nagara Samithi chairman Nagam Janardhan Reddy blamed CM Kiran Kumar Reddy and TDP chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X