సిఎంతో గొడవ పడలేదు, విషయం చెప్పా: బొత్స

దోచింది దాచుకోవడానికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన విమర్శించారు. అక్రమాలకు సంబంధించి వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. కర్ణాటకలో శ్రీరాములు గెలిస్తే అదంతా కరెక్టు అని అనగలమా అని ఆయన అడిగారు. అటువంటప్పుడు అన్నా హజారేలాంటివాళ్లు చేస్తున్న పోరాటానికి అర్థం లేదని ఆయన అన్నారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని తాము ఎన్నికల ప్రణాళికలో హామీ ఇవ్వలేదని ఆయన చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి తాము ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆయన అన్నారు. తప్పు చేసినట్లు రుజువైతే తల దించుకుంటామని ఆయన చెప్పారు. ఓ ప్రయోజనం కోసమైతే భూమిని కేటాయించామో ఆ ప్రయోజనం కోసం వాడకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications