జగన్ ఆరెస్టు పుకార్లు: సిటీకి చేరుతున్న శ్రేణులు
రాష్ట్రవ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేశారు. వైయస్ జగన్పై ఏమీ లేదని, పిసి యాక్టు కింద మాత్రమే కేసు పెట్టారని ఆయన తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. జగన్ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సిబిఐ అభియోగం మోపినట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రయోజనాలు పొందడం వల్లనే సంస్థలు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని సిబిఐ ఆరోపించింది. అరబిందో ఫార్మాకు మహబూబ్నగర్లో సెజ్ను మంజూరు చేశారు. ఈ సంస్థ జగన్ సంస్థల్లో పది కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టింది. పోలెపల్లి సెజ్లో హెటిరో డ్రగ్స్కు వైయస్ ప్రభుత్వ హయాంలో సెజ్ మంజూరైంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పలువురు కూడా హైదరాబాదుకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ తన ఓదార్పు యాత్రను శనివారం సాయంత్రం గుంటూరు జిల్లాలో ముగించుకుని హైదరాబాద్ రావాల్సి ఉంది.