సురవరం సుధాకర రెడ్డి చేతికి సిపిఐ పగ్గాలు

Suravaram Sudhakar Reddy
పాట్నా: సిపిఐ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర రెడ్డి ఎన్నికయ్యారు. ఎబి బర్దన్ స్థానంలో సురవరం సుధాకర రెడ్డి ఎన్నిక జరిగింది. పాతికేళ్ల తర్వాత సిపిఐ సారథ్యం ఓ తెలుగు నేతకు దక్కింది. గతంలో చండ్ర రాజేశ్వర రావు సిపిఐ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సిపిఐ జాతీయ మహాసభలు శనివారం పాట్నాలో ముగిశాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర రెడ్డిని ఈ జాతీయ మహాసభలో ఎన్నుకున్నారు. సురవరం సుధాకర రెడ్డి నల్లగొండ నుంచి రెండు సార్లు లోకసభకు ఎన్నికయ్యారు.

సురవరం సుధాకర రెడ్డి 1942 మార్చి 25వ తేదీన మహబూబ్‌నగర్‌లో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం కర్నూలులో జరిగింది. ఇప్పటి వరకు సుధాకర రెడ్డి సిపిఐ ఉప ప్రధాన కార్యదర్సిగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించారు. సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా కూడా రెండ దఫాలు ఆయన పనిచేశారు. సిపిఐ అనుబంధ సంఘాలు ఎఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేశారు. 2008లో హైదరాబాదులో జరిగిన సిపిఐ 20వ జాతీయ మహాసభల్లో ాయన పార్టీ ఉప ప్రధాన కార్యదర్సిగా ఎన్నికై ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. ఆయన సతీమణి బివి విజయలక్ష్మి బ్యాంక్ అధికారిగా పదవీ విరమణ చేసి, పార్టీ కోసం పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+