అందరికీ తెలుసు, ఆశ కాదు: తిరుపతి టిక్కెట్‌పై గల్లా

Galla Aruna Kumari
చిత్తూరు: రాజ్యసభ సభ్యుడు చిరంజీవి రాజీనామాతో ఖాళీ అయిన తిరుపతి అసెంబ్లీ సీటుపై తమకు ఎలాంటి ఆశ లేదని మంత్రి గల్లా అరుణ కుమారి సోమవారం అన్నారు. తిరుపతి అసెంబ్లీ సీటుపై చర్చించేందుకు, తిరుపతి పట్టణంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉదయం తిరుపతి వచ్చారు. గల్లా అరుణ కుమారి పద్మావతి అథితి గృహంలో ఉన్న ఆయనను కలిశారు. తన తనయుడు గల్లా జయదేవ్‌కు తిరుపతి టిక్కెట్ కేటాయించాలని ఆమె సిఎంకు విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తిరుపతి అసెంబ్లీ సీటుపై మాకు ఆశ కాదన్నారు. ప్రజా సేవ కోసమేనని చెప్పారు. తన తనయుడు గల్లా జయదేవ్ కాంగ్రెసు పార్టీకి చెందిన నేతనే అన్నారు. అందుకే తాము టిక్కెట్ కోసం అడుగుతున్నామని చెప్పారు. అయితే తుది నిర్ణయం అధిష్టానానిదేనని ఆమె చెప్పారు. అధిష్టానం ఎవరికి టిక్కెట్ ఇచ్చినా తాను కాంగ్రెసు పార్టీ నేతగా గెలిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డికి ఇక్కడి పరిస్థితులు తెలియనివి ఏముంటాయని అన్నారు. తన కొడుకుకు టిక్కెట్ కోసం పదే పదే వారి వెంట తిరిగే రకం తాను కాదన్నారు. మేమంతా కాంగ్రెసు కుటుంబం వ్యక్తులమే అన్నారు. గల్లా జయదేవ్‌కు ఇష్టం ఉందని, అందుకే ఆయనను ప్రమోట్ చేయాలని తాము భావిస్తున్నామని అన్నారు. ఇక్కడ ఎవరు స్థానికులో ఎవరు స్థానికులు కాదో అందరికీ తెలుసునని అన్నారు. అవకాశం వచ్చింది కాబట్టి తాము టిక్కెట్ ఇవ్వాలని అడుగుతున్నామని చెప్పారు.

కాగా ఉదయం చిత్తూరు జిల్లాకు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి స్థానం టిక్కెట్ ఎవరికి కేటాయించాలో జిల్లాకు చెందిన నేతలతో చర్చిస్తున్నారు. గెలిచే అభ్యర్థికే టిక్కెట్ ఇస్తామని ఆయన చెప్పారు. తమకే టిక్కెట్ కేటాయించాలని చిరంజీవి వర్గం, గల్లా అరుణ కుమారి వర్గం కార్యకర్తలు పట్టుబడుతున్నారు. మరికొందరు ఆశావహులు కూడా క్యూలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+