నాసీటుపై ఎవరు కన్నేశారు,'14వరకు కిరణే సిఎం:బొత్స

ఎసిబి తీరును తాను సమర్థించను వ్యతిరేకించనని చెప్పారు. తనను ఎవరో ముఖ్యమంత్రి టార్గెట్ చేసుకున్నారనేది అవాస్తవమన్నారు. అయినా తనను ఎవరైనా అంటే తాను వ్యక్తిగతంగా ఆలోచన చేయనన్నారు. పార్టీ అధ్యక్షుడిగా తాను బాధ్యతగా ఆలోచిస్తానని అన్నారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తాను లేక రాయలేదని చెప్పారు.
కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇస్తూ పార్టీని ముందుకు తీసుకు పోతాని చెప్పారు. మద్యం వ్యాపారంతో తనకు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. నా సన్నిహితులు, బంధువులకు పరోక్షంగా మద్యం వ్యాపారాలతో సంబంధం ఉందని చెప్పారు. తాను సిఎం సీటుపై కన్నేస్తే, తన సీటుపై ఎవరు వేశారంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు.
కాగా పిసిసి చీఫ్ బొత్స, ముఖ్యమంత్రి కిరణ్కు అధిష్టానం నుండి పిలుపు వచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బొత్స మంగళవారం సాయంత్రం, కిరణ్ బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications