చంద్రబాబు గతే కిరణ్కు: ఛార్జీల పెంపుపై ఈటెల, అరెస్ట్

విద్యుత్ సౌధ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తెరాస ఆందోళనతో ఖైరతాబాద్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ రహదారిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
ఆందోళన సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఫాలో అవుతున్నారని ఆరోపించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించకపోతే బాబుకు పట్టిన గతే పడుతుందన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కాంగ్రెసు ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు సామాన్యుడి నడ్డి విరిచేలా ఉందన్నారు.
వరంగల్ జిల్లాలో తెరాస శాసన సభ్యుడు వినయ భాస్కర్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టిఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications