'గాలి' గుట్టు అలీఖాన్కు తెలుసు: సిబిఐ, పారిపోలేదని..

ఈ సందర్భంగా సిబిఐ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఓబుళాపురం మైనింగ్ కేసులో జరిగిన అవతవకలు అన్నీ అలీ ఖాన్కు తెలుసునని చెప్పారు. ఈ కేసులో ఆయనను విచారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆయనను విచారిస్తే కేసులోని సమాచారమంతా బయటకు వస్తుందని చెప్పారు. బెంగళూరు జైలులో ఉన్న ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోరింది.
ఇందుకు అలీ ఖాన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. అలీ ఖాన్ ఎక్కడకు పారిపోలేదని చెప్పారు. సిబిఐ కార్యాలయానికి అతను పలుమార్లు వచ్చారని చెప్పారు. సిబిఐ అధికారులే ఆయనను విచారించకుండా పంపించారని తెలిపారు. కాగా ఇరువైపుల వాదనలు విన్న కోర్టు విచారణను 19వ తేదికి వాయిదా వేసింది.
కాగా ఇదే కేసులో అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి సిబిఐ కోర్టులో మరోమారు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అరెస్టైన జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి బెయిల్ పిటిషన్ పైన గురువారం వాదనలు పూర్తయ్యాయి. తీర్పును నాంపల్లి ప్రత్యేక కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
ఎమ్మార్ కేసులో సాక్షుల వాంగ్మూలాలు, ఛార్జీషీట్ ఇవ్వాలని సిబిఐ ప్రత్యేక కోర్టును ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ కోరింది. అందుకు కోర్టు అంగీకరించింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications